7, ఏప్రిల్ 2016, గురువారం

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో
మల్లెల పరిమళాల్ని రంగరించిన సౌందర్యానివో
నా ఎదలో గుభాళించిన పారిజాతానివో
ఈ పరిచయం కావాలి రాధామాధవుల ప్రణయకావ్యం
ఈ మమతలు కావాలి వేయిగా పెనవేసిన వసంతగీతం
నా ప్రియ నెచ్చెలీ...
నిను కనులారా వీక్షించాలని
మనసుతీరా స్ప్తృశించాలని
పరితపించే గడ్డిపువ్వును నేను...
ఇపుడు నేలరాలినా..
మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే వుంటా
ఎన్ని జన్మలైనా నిన్నందుకునేదాకా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి