పసుపు వర్ణ శోభిత సుందర చరణములు
చుంబించ మనసాయె అధరములకు
తాకినంత కందిపోయే సుకుమార పద్మములు
కందకుండునా కరకు పెదవుల చుంబనమునకు
ఆ స్పర్శ గుర్తు తెచ్చె తొలినాటి గిలిగింత
అందుకేనేమో ఏదో తెలియని పులకింత
అది మరపురాని సాయంత్రం
మరువలేని తీయని జ్ఞాపకం
- రాజాబాబు కంచర్ల
13-04-2016
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి