7, ఏప్రిల్ 2016, గురువారం

కవిత్వ దినోత్సవం

కవిత్వ దినోత్సవం
 ---------------------------------
నన్నయ అక్షర రమ్యత
తిక్కన రసాభ్యుచిత బంధం
ఎర్రన సూక్తి వైచిత్రి
నాచనసోమన నవీన గుణ సనాతత్వం
గురజాడ పాతకొత్తల మేలు కలయిక
తీరని దాహం శ్రీశ్రీ కవిత్వం
వెన్నెల్లాంటిది జాషువా కవిత్వం
నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
వెన్నెల్లో ఆడుకొనే అందమైన
ఆడపిల్లలు తిలక్ కవిత్వం
సినారే కవిత ప్రియురాలితో సమానం
... ఇలా ఎవరికి వారు కవిత్వం గురించి చెప్పినవి
కవిత్వ నిర్మాణం గురించిన అభిప్రాయాలే.
కవిత్వంలో ఇతివృత్తం ప్రధానం.
ఇతివృత్తానికి భావం అవసరం.
ఇతివృత్తం అంటే వస్తువు..
భావం అంటే అనుభూతి..
కవితలో భావం, వస్తువు తర్వాత ముఖ్యమైనవి పదాలు.
ఆ పదాల్లో నిపుణత వుండాలి.
కవిత్వమంటే... అక్షరాల కొలువు కాదు.
హృదయంలో పల్లవించి,
భాషలో పరిమళించే భావ స్పందన.
కవిత్వాన్ని సుఖానుభూతి కోసం కాక,
సమాజం కోసం రాసేవారు సాహిత్య ఉద్యమకారులు
ప్రపంచ కవిత్వ దినోత్సవం(21-03-2016) సందర్భంగా..
కవి మిత్రులకు, సాహితీవేత్తలకు అభినందనలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి