29, నవంబర్ 2016, మంగళవారం

మహాకవికి అక్షర నివాళి

ఈ శతాబ్దం నాదియని ప్రకటించుకున్న మహాకవి యాతడు
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్‌ స్వరూపమాతడు
కొత్త తరంతో కలిసి నడవాలని యత్నించిన నవయుగ వైతాళికుడాతడు
తన మరణానంతరమూ బతికేయున్న సామాజిక సంచలనమాతడు
కవిత్వ యుగాన్నే నడిపిన నడిపిస్తున్న అమరజీవియాతడు
ఆయనే మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)...
నా దారి రహదారి అన్నట్టుగా ఆయన ఒక ప్రజాబాటను ఏర్పరిచాడు.
తెలుగు సాహిత్యంలో స్తబ్థతను భగ్నం చేసి ఒక నవీన స్ఫూర్తిని అద్దాడు.
ఆ మహాకవి భావాల్లో, భాషలో, కదలికలో, అక్షరాల్లో ఆధునిక తెలుగు సాహిత్యానికి
ఆయనందించిన స్ఫూర్తీ, కీర్తి సజీవం.
శ్రీశ్రీ కవిత్వాన్ని అనుభవించి పలవరించడమే తప్ప.... దానికి ఏ తూనికలూ లేవు.
ఆ మహాకవికి ఘన నివాళి... నా అక్షరాంజలి
(శ్రీశ్రీ వర్థంతి (జూన్ 15, 1983) సందర్భంగా...)
- రాజాబాబు కంచర్ల
15-06-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి