7, ఏప్రిల్ 2016, గురువారం

విహరిద్దామా ‘స్వేచ్ఛ’గా


రెప్ప మాటు స్వప్నమా
ఎద లోపలి చిత్రమా
ఎదుటే నిలిచిన రూపమా
నా ప్రేమ దీపమా...
విహరిద్దామా ‘స్వేచ్ఛ’గా
కొత్త బంగారులోకంలో మనమిద్దరమే..

కవిత్వ దినోత్సవం

కవిత్వ దినోత్సవం
 ---------------------------------
నన్నయ అక్షర రమ్యత
తిక్కన రసాభ్యుచిత బంధం
ఎర్రన సూక్తి వైచిత్రి
నాచనసోమన నవీన గుణ సనాతత్వం
గురజాడ పాతకొత్తల మేలు కలయిక
తీరని దాహం శ్రీశ్రీ కవిత్వం
వెన్నెల్లాంటిది జాషువా కవిత్వం
నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
వెన్నెల్లో ఆడుకొనే అందమైన
ఆడపిల్లలు తిలక్ కవిత్వం
సినారే కవిత ప్రియురాలితో సమానం
... ఇలా ఎవరికి వారు కవిత్వం గురించి చెప్పినవి
కవిత్వ నిర్మాణం గురించిన అభిప్రాయాలే.
కవిత్వంలో ఇతివృత్తం ప్రధానం.
ఇతివృత్తానికి భావం అవసరం.
ఇతివృత్తం అంటే వస్తువు..
భావం అంటే అనుభూతి..
కవితలో భావం, వస్తువు తర్వాత ముఖ్యమైనవి పదాలు.
ఆ పదాల్లో నిపుణత వుండాలి.
కవిత్వమంటే... అక్షరాల కొలువు కాదు.
హృదయంలో పల్లవించి,
భాషలో పరిమళించే భావ స్పందన.
కవిత్వాన్ని సుఖానుభూతి కోసం కాక,
సమాజం కోసం రాసేవారు సాహిత్య ఉద్యమకారులు
ప్రపంచ కవిత్వ దినోత్సవం(21-03-2016) సందర్భంగా..
కవి మిత్రులకు, సాహితీవేత్తలకు అభినందనలు

ప్రేమనుకోనా..

‘ఇలా మనం క్షణాలలోనె దగ్గరైన వైనం
కలా నిజం ఇదేమిటంటే చెప్పలేని మౌనం
మనసులలోని రాగమే మధురస భావగీతమై
మరపుకురాని బంధమెంత గాఢమైన స్నేహమా
ప్రేమనుకోనా..’

ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా..

March 27 at 8:55am ·

‘ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా..
వెన్నెలంత హాయిగా
మల్లెలంత మత్తుగా
మనసంతా నిండుగా
జన్మజన్మలకు తోడుగా...’

అంబరమే దిగివచ్చి

‘అంబరమే దిగివచ్చి
అవనితోటి స్నేహం కోరింది
అవని సంబరపడి
అంబరానికి పూల దోసిలి పట్టింది
బీడువారిన ఎద వాకిట
తొలకరి జల్లు కురిసింది
శృతిలేని స్వరమున
రాగాలే పలికించింది’

ఏదో తెలియని ఒంటరితనం

ఏదో తెలియని ఒంటరితనం
మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన
జ్ఞాపకాల తుట్టిని తట్టి రేపుతుంటే...
మోమున చిరునవ్వులు వెలిగించుకొని
మనసున మంటలు చల్లార్చుతున్నా..

ఏదో తెలియని దగ్గరితనం
మోడువార్చిన శిశిరాన్ని ఊరడించి ఉగ్గడించి
జతగాడే వసంతుడై ఆశల చివుళ్లు తొడిగిస్తుంటే...
మనసున మమతలు వెలిగించుకొని
మోమున చిరునవ్వులు పూయిస్తున్నా...

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో

ఏ వనంలో విరబూసిన మల్లెతీగవో
మల్లెల పరిమళాల్ని రంగరించిన సౌందర్యానివో
నా ఎదలో గుభాళించిన పారిజాతానివో
ఈ పరిచయం కావాలి రాధామాధవుల ప్రణయకావ్యం
ఈ మమతలు కావాలి వేయిగా పెనవేసిన వసంతగీతం
నా ప్రియ నెచ్చెలీ...
నిను కనులారా వీక్షించాలని
మనసుతీరా స్ప్తృశించాలని
పరితపించే గడ్డిపువ్వును నేను...
ఇపుడు నేలరాలినా..
మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే వుంటా
ఎన్ని జన్మలైనా నిన్నందుకునేదాకా..