30, నవంబర్ 2016, బుధవారం

మాతృభాషకు పట్టం

తెలుగు భాషకు ప్రాచీన హోదా కిరీటం
ఇది తెలుగు జాతికి మకుటాయమానం
మాతృభాషకు పట్టం కడదాం
కొనఊపిరితో బతుకీడుస్తున్న తేటతెనుగును బతికించుకుందాం
ఇపుడైనా ఏలికలకు కలిగేనా జ్ఞానోదయం
ఇకనైనా వర్థిల్లేనా తెలుగు భాషావికాసం
నిర్మాణాత్మక దిశగా అడుగులు వేద్దాం
దశదిశలా తెలుగు వెలుగులు వ్యాపింపజేద్దాం
***
తెలుగు భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి
ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా
కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా, తెలుగుతోపాటు కన్నడ,
మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా అర్హత ఉందని మద్రాసు హైకోర్టు సోమవారం (08-08-2016) తేల్చి
చెప్పింది. తెలుగును ఆధునిక భాషగా గుర్తించడంతో పాటు ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి
చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- రాజాబాబు కంచర్ల
08-08-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి